పోలవరం పునరావాస పనులపై జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-08-13T01:47:05+05:30 IST
పోలవరం పునరావాస పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై అధికారులు వివరాలు ఇచ్చారు. కోవిడ్ సమయంలో కూడా పనులు జరిగాయని
అమరావతి: పోలవరం పునరావాస పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై అధికారులు వివరాలు ఇచ్చారు. కోవిడ్ సమయంలో కూడా పనులు జరిగాయని, సెప్టెంబర్ 15కల్లా స్పిల్ వే పిల్లర్స్ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. వర్షాకాలంలోనూ పనులు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నామని అధికారులు చెప్పారు. పోలవరం పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టిపెట్టాలని జగన్ సూచించారు.