ఇరిగేషన్‌శాఖపై జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-08-12T23:40:16+05:30 IST

ఇరిగేషన్‌శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అపెక్స్ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్ట్‌ల వివరాలను జగన్‌ తెలుసుకున్నారు.

ఇరిగేషన్‌శాఖపై జగన్‌ సమీక్ష

అమరావతి: ఇరిగేషన్‌శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అపెక్స్ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్ట్‌ల వివరాలను జగన్‌ తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల ప్రగతిపై, ఈ ఏడాది ప్రారంభించనున్న ప్రాజెక్ట్‌ల గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు, సహాయ పునరావాస కార్యక్రమాలపై జగన్‌ ఆరా తీశారు.

Updated Date - 2020-08-12T23:40:16+05:30 IST