కరోనా పరిస్థితులపై జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2022-01-17T21:10:25+05:30 IST
కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కరోనా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు.
అమరావతి: కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కరోనా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యతను మరింతగా పెంచాలని ఆదేశించారు. ప్రికాషన్ డోస్ సమయాన్ని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 104 కాల్సెంటర్ పటిష్టంగా పనిచేయాలని, టెలిమెడిసిన్ ద్వారా కాల్చేసిన వారికి వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్ క్లినిక్స్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హోర్డింగ్ పెట్టాలని జగన్ సూచించారు.