కరోనా కట్టడి చర్యలపై జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-08-07T22:39:46+05:30 IST
కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 104, 14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలన్నారు.
అమరావతి: కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 104, 14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలన్నారు. 139 ఆస్పత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో భోజనం, పారిశుద్ధ్యంపై సీఎం ఆరా తీశారు. మెనూ కచ్చితంగా అమలు చేసేలా చూస్తున్నామన్న అధికారులు, సీఎంకు వివరించారు. టెలిమెడిసిన్ కింద మందులు పొందిన వారికి మళ్లీ పోన్చేసి సేవలపై ఆరా తీయాలని, కాల్ సెంటర్ సేవలపైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలని జగన్ చెప్పారు. ఎప్పటికప్పుడు వస్తున్న లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు మాస్కులు ఇవ్వాలని ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలపైన కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, ఆరోగ్య శ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్దా కోవిడ్ సోకిందని అనిపిస్తే ఏంచేయాలన్నదానిపై హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలని సూచించారు. ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలని జగన్ ఆదేశించారు.