పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణం: ఉమా

ABN , First Publish Date - 2022-08-11T09:03:22+05:30 IST

పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణం: ఉమా

పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణం: ఉమా

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు సంస్థ, జలవనరుల శాఖ సరైన ప్రణాళిక అమలు చేయకపోవడం వల్లే ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం, ప్రాజెక్ట్‌ అథారిటీ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని, కేంద్ర సంస్థలు హెచ్చరిస్తున్నా.. జగన్‌రెడ్డి పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. గోదావరి వరదల్లో దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా వరద నీరు పోటెత్తి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తడానికి నిర్మాణ పనులు నెమ్మదిగా జరగడమే కారణమని ఉమా వివరించారు.

Updated Date - 2022-08-11T09:03:22+05:30 IST