జగనన్న రియాల్టర్‌గా మారారు: దినకర్‌

ABN , First Publish Date - 2022-01-09T02:21:48+05:30 IST

జగన్‌రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారసంస్థగా మారిందని బీజేపీ నేత లంకా దినకర్ ధ్వజమెత్తారు.

జగనన్న రియాల్టర్‌గా మారారు: దినకర్‌

అమరావతి: జగన్‌రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారసంస్థగా మారిందని బీజేపీ నేత లంకా దినకర్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను లేఔట్లుగా మార్చి.. ఆ భూముల అభివృద్ధి ఖర్చుల రూపంలో అవినీతి ప్రణాళిక రచిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ స్మార్ట్ సిటీలుగా నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేస్తుంటే.. జగనన్న స్మార్ట్‌గా ప్రభుత్వ ఆస్తులతో రియాల్టర్‌గా మారారని దుయ్యబట్టారు. అప్పులు అందకపోవడంతో జగన్ ప్లాట్ల వ్యాపారం కోసం పాట్లు పడుతున్నారని ఎద్దేవాచేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అన్యాక్రాంతం జగనన్న లక్ష్యంగా మారిందన్నారు. బిల్డ్ ఏపీ అంటూ కిల్ ఏపీ వైపు రాష్ట్రంలో పాలన సాగుతోందని దినకర్ దుయ్యబట్టారు.

Updated Date - 2022-01-09T02:21:48+05:30 IST