జగనన్న రహస్య పాలన ఎందుకో అర్ధం కావడం లేదు: రఘురామ
ABN , First Publish Date - 2021-12-23T20:09:51+05:30 IST
జగనన్న రహస్య పాలన ఎందుకో అర్ధం కావడం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీలో రెండేళ్లలో ఒక్క
ఢిల్లీ: జగనన్న రహస్య పాలన ఎందుకో అర్ధం కావడం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీలో రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కేంద్రమంత్రి పార్లమెంట్లో చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ఇళ్లను కూడా ఎవరికి ఇవ్వడం లేదని విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్ ఏదో దేవాలయాలకు చేస్తున్నారని అంటున్నారని, దేవాలయాలకు, చర్చిలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని చెప్పారు. ఆ విషయం మంత్రులు తెలుసుకోవాలని సూచించారు. భారతి సిమెంట్స్ నుంచి నిధులు తెచ్చుకోవాలని, ఎవరు వద్దన్నారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.