కేంద్రం ఇచ్చే నిధులను జగన్ సర్కార్ కాజేస్తోంది: నారా లోకేశ్
ABN , First Publish Date - 2022-04-22T02:06:16+05:30 IST
కేంద్రం ఇచ్చే నిధులను జగన్ సర్కార్ కాజేస్తోందని టీడీపీ నారా లోకేశ్ ఆరోపించారు. దుగ్గిరాల మండలం ఈమనిలో లోకేశ్ పర్యటించారు.
గుంటూరు: కేంద్రం ఇచ్చే నిధులను జగన్ సర్కార్ కాజేస్తోందని టీడీపీ నారా లోకేశ్ ఆరోపించారు. దుగ్గిరాల మండలం ఈమనిలో లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఒకప్పుడు బిహార్లో జరిగిన ఘటనలు ఇప్పుడు ఏపీలో చూస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. 3 నెలల్లో ఈమని గ్రామ రూపురేఖలు మారుస్తానన్న ఎమ్మెల్యే ఎక్కడ? అని ప్రశ్నించారు. మంగళగిరి పౌరుషం ఏంటో ఎమ్మెల్యేకి చూపిస్తామని హెచ్చరించారు. కేసులు పెట్టి వేధిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అవినీతిరహిత పాలన అని జగన్ అంటుంటే పిల్లలు కూడా నవ్వుతున్నారని తెలిపారు. ఏసీబీ యాప్ పెట్టగానే జగన్పై తానే మొదటి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇసుక, కల్తీ మద్యంతో జగన్ వేల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు సొంత కార్యకర్తల భూములనూ కొట్టేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.