ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్‌

ABN , First Publish Date - 2021-01-27T05:03:52+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం జగన్‌ సొంత పరిపాలన చేస్తూన్నారని టీడీపీ కడప పార్లమెంటు ఇన్‌చార్జి మల్లెల లింగారెడ్డి విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్‌
మాట్లాడుతున్న కడప టీడీపీ పార్లమెంటు ఇన్‌చార్జి లింగారెడ్డి

టీడీపీ  కడప పార్లమెంటు ఇన్‌చార్జి మల్లెల లింగారెడ్డి 

ఎర్రగుంట్ల, జనవరి 26: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం జగన్‌ సొంత పరిపాలన చేస్తూన్నారని టీడీపీ  కడప పార్లమెంటు ఇన్‌చార్జి మల్లెల లింగారెడ్డి విమర్శించారు. మంగళవారం ఎర్రగుంట్ల టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అధికారులు రాజ్యాంగ బద్దంగా పనిచేయాలికాని ఒక పార్టీకి వ్యక్తికి తొత్తులుగా వ్యవహరిం చడం సరైందికాదన్నారు.  ప్రజలకు సంక్షేమ పథకాలు బాగా అమలు చేసామని చెప్పుకుంటున్న జగన్‌ ప్రభుత్వం ఎన్నికలకు ఎందుకు బయపెడుతోందని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినా సరే గెలవలేమనే ఎన్నికలే జరపకూడదనే నిర్ణయానికి జగన్‌  వచ్చారని ధ్వజమెత్తారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలతో, అడ్డదారులతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవానికి పాల్పడ్డారని ఇప్పడా పరిస్థితి లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో  పోటీకి ముందుకొచ్చే ప్రతి ఒక్కరికి పార్టీ అండగా వుంటుందన్నారు.  జమ్మలమడు గు నియోజవర్గానికి ఇన్‌చార్జిని త్వరలో నియమిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సుంకరనాగేశ్వరరావు, రమేష్‌, సం జీవరెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, రమే్‌షరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:03:52+05:30 IST