మరో 30 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారు: Minister Suresh

ABN , First Publish Date - 2022-05-05T02:12:09+05:30 IST

ప్రజల అభీష్టం మేరకు మరో మూడు దశ బ్ధాల పాటు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

మరో 30 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారు: Minister Suresh

గుంటూరు: ప్రజల అభీష్టం మేరకు మరో మూడు దశ బ్ధాల పాటు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గుంటూరులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత Lokesh సైకిల్‌ యాత్ర వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ప్రతిపక్ష నాయకులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పాలన అందించడం వల్లే టీడీపీ నాయకులకు ఈ గతి పట్టిందన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా వారు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్రల వల్ల, బస్సు యాత్రల వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం ఉండదని Suresh జోస్యం చెప్పారు.

Read more