మెట్రోపాలిటిన్‌ ఏరియా డెవలప్‌ అథారిటీపై జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-08-13T19:11:24+05:30 IST

అమరావతి: మెట్రోపాలిటిన్‌ ఏరియా డెవలప్‌ అథారిటీపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

మెట్రోపాలిటిన్‌ ఏరియా డెవలప్‌ అథారిటీపై జగన్ సమీక్ష

అమరావతి: మెట్రోపాలిటిన్‌ ఏరియా డెవలప్‌ అథారిటీపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఏఎంఆర్డీయే కమిషనర్‌ లక్ష్మీనరసింహం ఇతర అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో ప్రస్తుతం ఏయే దశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని పూర్తి చేసే కార్యాచరణపై అధికారులతో జగన్ చర్చించారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్‌ చేసుకోవాలన్నారు. హ్యాపీ నెస్ట్‌ బిల్డింగులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-08-13T19:11:24+05:30 IST