జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది: లోకేష్‌

ABN , First Publish Date - 2022-04-15T22:42:08+05:30 IST

సీఎం జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది: లోకేష్‌

అమరావతి: సీఎం జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులో చోరీకి పాల్పడి.. ఆధారాలను సైతం వైకాపన్లు కొట్టేస్తున్నారని మండిపడ్డారు. 3 నెలల క్రితమే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నకిలీ పత్రాల కేసును.. ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించి భంగపడిందన్నారు. జూన్‌లో వాదనలు ప్రారంభమైతే జైలుకెళ్లడం ఖాయమనే భయంతోనే కీలక ఆధారాలను మాయం చేశారని దుయ్యబట్టారు. నెల్లూరులోని 4వ ఏడీఎం కోర్టులో జరిగిన చోరీపై సమగ్ర విచారణ జరగాలన్నారు. బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-15T22:42:08+05:30 IST