అమరావతి: సీఎం జగన్ ఏపీని మద్యాంద్రప్రదేశ్ గా మార్చారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను నవ విధాలా పిండుతున్నారని దుయ్యబట్టారు. పన్నులు, చార్జీలు పెంచుతూ ప్రజల రక్తాన్ని పిలుస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతుంటే మంత్రులు వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నాటు సారా తయారీ జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ అరాచక పాలనను సమూలంగా తుడిచి పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.