జగన్ క్రైస్తవుడు కాదు: జవహర్
ABN , First Publish Date - 2021-12-31T01:45:34+05:30 IST
సీఎం జగన్ క్రైస్తవుడు కాదని మాజీ మంత్రి జవహర్ను సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు.
కొవ్వూరు: సీఎం జగన్ క్రైస్తవుడు కాదని మాజీ మంత్రి జవహర్ను సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ధర్మశాస్త్రాన్ని అనుసరించి రాష్ట్రంలోఎక్కడా పరిపాలన జరగడం లేదు. క్రైస్తవుడినని చెప్పుకుంటూ, పది ఆజ్ఞలు పాటించకుండా క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. హిందూ ధర్మశాస్ర్తాన్ని అనుసరించకుండా హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా పరిపాలన జరుగుతోంది. జగన్మోహన రెడ్డి క్రైస్తవుడు కాదని.. క్రైస్తవ సమాజానికి తెలియ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. జగన్ క్రైస్తవ మతోద్దారుకుడిలా ప్రచారం చేస్తున్నాడన్నది సరి కాదు. బైబిలు ప్రకారం ప్రతి క్రైస్తవుడు పది ఆజ్ఞలు పాటించాలి. స్వామి స్వరూపానంద కాళ్లు పట్టుకోవడం, గంగలో మునగడం, కొవ్వూరులో పిండ ప్రదానాలు చేయడం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జగన్ క్రైస్తవుడు కాదని క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. వేషదారుడు అయిన వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదకారి. ఏ మత ధర్మం మీద జగన్కు విశ్వాశం లేదు’’ అని జవహర్ విమర్శించారు.