జగన్... ఓ అబద్ధాల కోరు: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2022-03-21T01:01:38+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ అబద్ధాల కోరు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి దుయ్యబట్టారు.
అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ అబద్ధాల కోరు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే.. మద్యాన్ని దశలవారీగా పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన జగన్మోహన్రెడ్డి.. పగ్గాలు చేపట్టాక మాట తప్పారన్నారు. అందుకే జగన్ను అబద్ధాల కోరు అనాల్సి వస్తోందన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తాగుబోతు ప్రభుత్వంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కల్తీ, నాటుసారా, చీప్ బ్రాండ్ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. వాటిని తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అధికారంలోకి రావడం జగన్కు సాధ్యం కాదని తులసిరెడ్డి జోస్యం చెప్పారు.