నవరత్నాల అమలు ఘనత జగన్‌దే

ABN , First Publish Date - 2022-09-30T06:20:09+05:30 IST

రాష్ట్రంలో నవరత్నాల అమలు ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయు డు అన్నారు.

నవరత్నాల అమలు ఘనత జగన్‌దే
స్టాల్స్‌ను తిలకిస్తున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

కె.కోటపాడు, సెప్టెంబరు 29: రాష్ట్రంలో నవరత్నాల అమలు ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయు డు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చేయూత మూడో విడత పథకాన్ని గురువారం ప్రారంభించారు. తొలుత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద బూడి, ఎంపీ డాక్టర్‌ భీశెట్టి సత్యవతి జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే అక్కడ ప్రదర్శనలో ఉంచిన వివిధ స్టాల్స్‌ను తిలకించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా నవరత్నాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. చేయూత పథకంలో భాగంగా కె.కోటపాడు మండలానికి మూడో విడత సుమారు రూ.9.16 కోట్లు మంజూర య్యాయన్నారు. ఎంపీ డాక్టర్‌ సత్యవతి రాష్ట్రంలో జగన్‌, నియోజకవర్గంలో బూడి చేస్తున్న అభివృద్ధిని వివరించారు. అనంతరం జడ్పీటీసీ ఈర్లె అనురాధ, ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేచలపు దొరబాబు, గొరుపోతు వెంకటరావు, బండారు ముత్యాలనాయుడు, బొడ్డు తాతయ్యబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T06:20:09+05:30 IST