సుప్రీంకోర్టు చివాట్లతో అయినా జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-06-04T01:37:35+05:30 IST
సుప్రీంకోర్టు చివాట్లతో అయినా జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి: శైలజానాథ్
గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు చివాట్లతో అయినా జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలని శైలజానాథ్ సూచించారు. నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే ప్రజావ్యతిరేకత, కోర్టుల నుంచి చివాట్లు తప్పవని శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం తప్పని హైకోర్టు చెప్పినా.. సుప్రీంకోర్టుకు వెళ్లడం మరో తప్పు అని శైలజానాథ్ చెప్పారు. నిర్ణయాలు ప్రజాహితంగా ఉండాలని.. లేకపోతే భంగపాటు తప్పదని శైలజానాథ్ హెచ్చరించారు. ఇకనైనా నియంతృత్వ విధానాలు మార్చుకోవాలని శైలజానాథ్ స్పష్టం చేశారు.