‘జగన్‌ సర్కార్‌ను గద్దె దించాలి’

ABN , First Publish Date - 2022-05-16T05:00:04+05:30 IST

వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ను గద్దె దించాలని కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి ప్రజలకు తెలియజేశారు.

‘జగన్‌ సర్కార్‌ను గద్దె దించాలి’
నార్జంపల్లె గ్రామంలో ఇంటింటికి తిరిగి పెంచిన ధరలపై వివరిస్తున్న మల్లెల లింగారెడ్డి, భూపే్‌షరెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, మే 15: వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ను గద్దె దించాలని కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి ప్రజలకు తెలియజేశారు. ఆదివారం మైలవరం మండలంలోని నార్జాంపల్లె గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు ఇంటింటి పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, కిరణ్‌ రాయల్‌, నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, పరమేశ్వరరెడ్డి, ఖాదర్‌బాష, కొండారెడ్డి, దస్తగిరిరెడ్డి, రాజానాయక్‌, బాలపుల్లయ్య, రామాంజనేయరెడ్డి, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T05:00:04+05:30 IST