ఏపీలో కొత్తరకం వైరస్‌‌పై జగన్ సర్కార్ వివరణ

ABN , First Publish Date - 2021-05-06T19:09:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు

ఏపీలో కొత్తరకం వైరస్‌‌పై జగన్ సర్కార్ వివరణ

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో నమోదైన ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. దీనిపై ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి మీడియా మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. గత ఏడాది జూన్, జులై‌లో ఈ స్ట్రెయిన్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నమూనాలు నుంచి సీసీఎంబీ గుర్తించిందని తెలిపారు.


డేటా ఆధారంగా..

ఏపీ లో 2021 ఫిబ్రవరి వరకు కనిపించి క్రమంగా తగ్గింది. ఇప్పుడు ఈ రకం వైరస్‌ను చాలా తక్కువ‌గా గుర్తిస్తున్నాం. ప్రస్తుతం సౌత్ ఇండియా నమూనాలు నుంచి బి.1.617 మరియు బి1 గుర్తించాం. ఏప్రిల్ నెల డేటా ఆధారంగా దీన్ని గుర్తించాం. ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని గ్రహించాం. యువకుల్లో సైతం దీని వ్యాప్తి అధికం ఉంటుందని గుర్తించాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియెంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించింది. అయితే ఎన్440కే పై ఎలాంటి ప్రస్తావన చేయలేదు అని జవహర్ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు.

Updated Date - 2021-05-06T19:09:20+05:30 IST