‘స్థానిక పరిపాలనను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది’
ABN , First Publish Date - 2021-03-07T23:51:36+05:30 IST
సీఎం జగన్పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఆదివారం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ
గుంటూరు: సీఎం జగన్పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఆదివారం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ స్థానిక పరిపాలనను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. నగరాలు, పట్టణాల్లో ఆస్తిపన్నును భారీగా పెంచారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.