పాలనలో జగన్‌ ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-08-15T04:51:33+05:30 IST

పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేష్‌రెడ్డి విమర్శించారు.

పాలనలో జగన్‌ ప్రభుత్వం విఫలం
బాదుడే బాదుడు కార్యక్రమంలో దేవగుడి భూపేష్‌రెడ్డి

టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేష్‌రెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 14: పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని  రామిరెడ్డిపల్లెలో  నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములగుడిలో పూజలు చేశారు.  అనంత రం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరిగి  కరపత్రాలు అందజేశారు.  వైసీపీ మూడేళ్ల పాలనలో ధరలు పెంచడం తప్ప సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు. నిరుద్యోగులు పెరిగిపోతున్నారని, కొన్ని చోట్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులకు కోతలు పెట్టి, సాకులు చూపి తొలగిస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపాలని, టీడీపీని గెలిపించాలని, వచ్చేది చంద్రబాబు పరిపాలనేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జె.రమణా రెడి ్డ, రాయల్‌కిరణ్‌, నవనీష్‌రెడ్డి, సయ్యద్‌, అనిల్‌కుమార్‌రెడ్డి, నాగరాజు, వెంకటేష్‌, ప్రభాకర్‌, చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T04:51:33+05:30 IST