జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-17T23:32:32+05:30 IST

సీఎం జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ

జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వం: చంద్రబాబు

తిరుపతి: సీఎం జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆయన మాట్లాడుతూ  అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాజధాని రైతులు, మహిళల పోరాటానికి అభినందనలు తెలిపారు. రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. మహాపాదయాత్రలో పాల్గొన్నవారిపైనా కేసులు పెట్టారని తెలిపారు. అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా జగన్‌రెడ్డి మాట తప్పారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని చెప్పారు.


ప్రజారాజధాని అమరావతిపై మూడు ముక్కలాట ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి అమరావతి బ్రహ్మాండమైన ఆర్థికవనరుల్ని సృష్టించగలదని చంద్రబాబు తెలిపారు. దూరదృష్టిలేని జగన్‌రెడ్డి అమరావతిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. కోర్టు ఆదేశాలు పాటిస్తూ నిర్ణీత సమయానికి చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.

Updated Date - 2021-12-17T23:32:32+05:30 IST