జగన్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తోంది: పట్టాభి
ABN , First Publish Date - 2022-01-09T21:06:02+05:30 IST
సీఎం జగన్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: సీఎం జగన్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పండగ సామన్లు కొనాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, నిత్యావసరాల ధరలు పెరిగాయని, స్వయంగా మంత్రే ఒప్పుకున్నారని పట్టాభి తెలిపారు. కమీషన్లు ముడితేచాలు ఏమైనా చేసుకోండి అనే తీరుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో మాజీ సీఎం జయలలిత ఏర్పాటు చేసిన.. అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఏపీలో సంక్రాంతి కానుకలు లేవు, అన్న క్యాంటీన్లు లేవని, ఇదేనా పేదలను ఉద్దరించడం అని పట్టాభి ప్రశ్నించారు.