YCP Govt.: మళ్లీ అధిక వడ్డీకి అప్పులు

ABN , First Publish Date - 2022-08-02T21:14:22+05:30 IST

మళ్లీ అధిక వడ్డీకి వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) అప్పులు చేసింది.

YCP Govt.: మళ్లీ అధిక వడ్డీకి అప్పులు

అమరావతి (Amaravathi): మళ్లీ అధిక వడ్డీకి వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) అప్పులు చేసింది. మంగళవారం రిజర్వ్‌ బ్యాంక్‌ (Reserve Bank) దగ్గర సెక్యూరిటీ బాండ్లు (Security bonds) వేలం వేసి రూ.2 వేల కోట్లు అప్పు తీసుకుంది. అందులో వెయ్యి కోట్లు 12 సంవత్సరాలకు 7.72 శాతం వడ్డీకి రుణం తీసుకోగా.. మరో వెయ్యి కోట్లు 20 ఏళ్లకు 7.82 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. కాగా 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం రూ.28 వేల కోట్లు రుణంగా తీసుకువచ్చింది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పరిధిలో...ఇంకా రూ. 20 వేలకోట్లు మాత్రమే బాండ్ల వేలం ద్వారా సమీకరించే అవకాశం ఉంది. జగన్ ప్రభత్వం మూడు నెలల్లో రూ. 28 వేల కోట్ల రుణం తీసుకోవడంపై ఆర్ధిక నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2022-08-02T21:14:22+05:30 IST