తండ్రి కలలను సాకారం చేస్తున్న జగన్‌: ఎంపీ బాలశౌరి

ABN , First Publish Date - 2020-10-01T16:24:14+05:30 IST

మాజీ సీఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కన్న కలలను ఆయన తనయుడు జగన్‌ సాకారం చేస్తున్నారని..

తండ్రి కలలను సాకారం చేస్తున్న జగన్‌: ఎంపీ బాలశౌరి

నాగాయలంక(కృష్ణా): మాజీ సీఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కన్న కలలను ఆయన తనయుడు జగన్‌ సాకారం చేస్తున్నారని మచిలీపట్నం ఎంపీ వల్లబనేని బాలశౌరి అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు.  కమ్మనమోలు, తలగడదీవిల్లో ఉపాధి నిధులతో నిర్మించే సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రాలకు బుధవారం ఎంపీ, ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.


అనంతరం ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో డ్వాక్రా మహిళలు చేసిన అప్పులను జగన్‌ ఆసరాతో రుణవిముక్తి చేశారన్నారు. భోగాది శేషగిరిరావు, తహసీల్దార్‌ విమలకుమారి, ఎంపీడీవో పి.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ డీఈఈ కె.వరప్రసాద, ఏఈ వాసుదేవరావు, ఏవో రామసుబ్బారెడ్డి,  మోకా బుచ్చిబాబు, వరప్రసాద్‌, మద్ది చిన్నా, తోట సాయిబాబు పాల్గొన్నారు. 


దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం అందిస్తాం : ఎంపీ బాలశౌరి

ఘంటసాల : వరదతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయటం జరుగుతుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. దివిసీమ పర్యటనలో భాగంగా కొడాలిలో విలేకర్లతో మాట్లాడారు. వరితోపాటు ఉద్యానపంటలు కూడా ముంపునకు గురయ్యాయన్నారు.  తుమ్మల మురళీకృష్ణ, వేమూరి వెంకట్రావ్‌, దిరిశం పిచ్చేశ్వరరావు, సింహాద్రి శ్రీనివాసరావు, వేమూరి రాజేంద్ర, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.    

Updated Date - 2020-10-01T16:24:14+05:30 IST