జగన్ దుర్మార్గపు పాలన చేస్తున్నాడు: నక్కా
ABN , First Publish Date - 2020-07-06T00:59:00+05:30 IST
సీఎం జగన్ దుర్మార్గపు పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారని, భూముల్ని కబ్జా చేసి కోట్లు
గుంటూరు: సీఎం జగన్ దుర్మార్గపు పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారని, భూముల్ని కబ్జా చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వినుకొండలో ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నివాసయోగ్యంకాని భూముల్ని పేదలకు కట్టబెడుతున్నారని, అధికారులు వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆనందబాబు ధ్వజమెత్తారు.