జగన్వన్నీ తెలివి తక్కువ నిర్ణయాలే: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2020-04-10T20:32:09+05:30 IST
సీఎం జగన్వన్నీ తెలివి తక్కువ నిర్ణయాలేనని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. వైసీపీ ఆర్డినెన్స్లేవీ చట్టపరిధిలో నిలబడవని చెప్పారు. ఎస్ఈసీ రమేష్కుమార్ది చారిత్రాత్మక నిర్ణయమని
అమరావతి: సీఎం జగన్వన్నీ తెలివి తక్కువ నిర్ణయాలేనని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. వైసీపీ ఆర్డినెన్స్లేవీ చట్టపరిధిలో నిలబడవని చెప్పారు. ఎస్ఈసీ రమేష్కుమార్ది చారిత్రాత్మక నిర్ణయమని, ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలను రమేష్ రక్షించారని కొనియాడారు. మెడ్టెక్ జోన్లో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని, ఇప్పుడు మెడ్టెక్ జోన్ నుంచే పీపీఈలు, మాస్కులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అహంకారంతో మెడ్టెక్జోన్ను 10నెలల నాశనం చేశారని, రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలకు పాల్పడుతోందని దేవినేని ఉమా ధ్వజమెత్తారు.