ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్

ABN , First Publish Date - 2021-06-11T18:58:05+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది.

ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన జగన్.. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిన్న అమిత్ షాతో సహ ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. పర్యావరణ శాఖ మంత్రి జవడేకర్, జలశక్తి మంత్రి షెకావత్, నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం మరో ఇద్దరు కేంద్ర మంత్రులను జగన్ కలిశారు. పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే శాఖ మంత్రి పీయూష్  గోయల్‌ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. ఇవాళ కేంద్రమంత్రులను కలిసిన సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-06-11T18:58:05+05:30 IST