పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు: జగన్

ABN , First Publish Date - 2020-08-15T20:50:07+05:30 IST

విజయవాడ: స్వతంత్ర దినోత్సవ సందేశంలో సీఎం జగన్... ఇంగ్లీషు మీడియం గురించి ప్రస్తావించారు.

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు: జగన్

విజయవాడ: స్వతంత్ర దినోత్సవ సందేశంలో సీఎం జగన్... ఇంగ్లీషు మీడియం గురించి ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 15 ప్రకారం ఏ ఒక్క పౌరుడు కులం, మతం, ప్రాంతం వంటి కారణాల వల్ల అన్యాయానికి గురి కావడానికి వీల్లేదన్నారు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరమన్నారు. విద్యాపరంగా అంటరానితనాన్ని పాటించాల్సిందనే వాదనలు మరో రూపంలో ఇప్పుడు వినిపిస్తున్నాయన్నారు. తమ పిల్లల్ని, మనుమల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తామంటున్నారని... కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదనే వాదన చేస్తున్నారన్నారు. ఇలా వాదించడం ద్వారా వారు రూపం మార్చుకున్న అంటరానితనాన్ని బాహాటంగా ప్రదర్శిస్తున్నారని... దీనిని తాము సమర్ధించలేమని జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T20:50:07+05:30 IST