కరోనాపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-13T20:03:54+05:30 IST

కరోనాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనాపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు

అమరావతి: కరోనాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిందేనని రైతు భరోసా కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఇబ్బందిపెడుతోందన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం నెలకు ఏడు కోట్లు మాత్రమే ఉందన్నారు. దేశం మొత్తంలో రెండు కంపెనీలే కోవిడ్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం చేస్తూ..జాగ్రత్తలు పాటిస్తూ.. యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సీఎం జగన్ సూచించారు.

Updated Date - 2021-05-13T20:03:54+05:30 IST