హైకోర్టు మొట్టికాయలు వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు: శ్రీనివాస్ యాదవ్

ABN , First Publish Date - 2020-05-29T23:40:36+05:30 IST

హైకోర్టు మొట్టికాయలు వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు: శ్రీనివాస్ యాదవ్

హైకోర్టు మొట్టికాయలు వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు: శ్రీనివాస్ యాదవ్

గుంటూరు: ఎన్నికల కమిషన్ పై  హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జనసేన పార్లమెంటు ఇన్ చార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వ్యక్తిగత కక్ష్యలతో అధికారులను వేధించడం సరికాదన్నారు. హైకోర్టు వరుస మొట్టికాయలు వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లోపాలను సవరించుకోకుండా న్యాయ వ్యవస్థపైనే విమర్శలు చేస్తున్నారని,బాధ్యతగా ఉండాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా న్యాయమూర్తులకు రాజకీయాలు ముడి పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూశారని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయకపోతే ఏపీలో లక్షలాది మంది కరోనా భారీన పడేవారని ఆయన అన్నారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో అయినా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు మానుకోని.. అఖిల పక్షంతో చర్చించాలని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-29T23:40:36+05:30 IST