జగన్‌ సేవలు మరువలేనివి : బాలూనాయక్‌

ABN , First Publish Date - 2021-07-26T07:10:11+05:30 IST

ప్రముఖ వ్యాపారవేత్త ఊరె జగన్‌ పేదలకు అందించిన సేవలు మరువలేనివని జడ్పీ మాజీ చైర్మన్‌ నేనావత్‌ బాలూనాయక్‌, మహిళా శిశు సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ జిల్లా చైర్మన్‌ కంకణాల ప్రవీణవెంకట్‌రెడ్డి, ఎంపీపీ కొండూరు భవానిపవన్‌కుమార్‌ అన్నారు.

జగన్‌ సేవలు మరువలేనివి  : బాలూనాయక్‌
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న బాలునాయక్

చింతపల్లి, జూలై 25 : ప్రముఖ వ్యాపారవేత్త ఊరె జగన్‌ పేదలకు  అందించిన సేవలు మరువలేనివని జడ్పీ మాజీ చైర్మన్‌ నేనావత్‌ బాలూనాయక్‌, మహిళా శిశు సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ జిల్లా చైర్మన్‌ కంకణాల ప్రవీణవెంకట్‌రెడ్డి, ఎంపీపీ కొండూరు భవానిపవన్‌కుమార్‌ అన్నారు. ఆదివారం వారు మండలంలోని వీటీనగర్‌లో వ్యాపారవేత్త ఊరె జగన్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఊరె జగన్‌ 50ఏళ్లుగా వ్యాపార రంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు వీటీనగర్‌ పరిసర ప్రాంతాలకు చెందిన పేదలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కొండూరు శ్రీదేవిశ్రీనివాస్‌, ఊరె జగన్‌ ట్రస్టు చైర్మన్‌ ఊరె లక్ష్మణ్‌, ఊరే యాదయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-26T07:10:11+05:30 IST