జగన్ అక్రమాస్తుల కేసుపై నేడు సీబీఐ విచారణ
ABN , First Publish Date - 2021-06-24T17:15:07+05:30 IST
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తులపై గురువారం సీబీఐ కోర్టు విచారణ జరపనుంది.
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తులపై గురువారం సీబీఐ కోర్టు విచారణ జరపనుంది. జగతి పబ్లికేషన్, వాన్ పిక్ చార్జిషీట్లపై వాదనలు వినిపించనున్నారు. అభియోగాల నమోదుపై జగతి పబ్లికేషన్స్ వాదనలు విన్న న్యాయస్థానం ముందు మరోసారి వాదనలు వినిపించనుంది.
జగతి పబ్లికేషన్, వాన్ పిక్ చార్జిషీట్లపై నిన్న వాదనలు కొనసాగిన తర్వాత కోర్టు గురువారానికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ మళ్లీ వాచారణ జరగనుంది. అభియోగాల నమోదుకు సంబంధించి జగతి పబ్లికేషన్ తరఫున వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.