జగన్ ఆయన అనుచరుల అవినీతిపై నేషనల్ మీడియాలో కథనాలు

ABN , First Publish Date - 2021-03-06T16:13:32+05:30 IST

జగన్మోమన్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతి అంతర్జాతీయ స్థాయిలో సాగుతోంది.

జగన్ ఆయన అనుచరుల అవినీతిపై నేషనల్ మీడియాలో కథనాలు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోమన్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతి అంతర్జాతీయ స్థాయిలో సాగుతోంది. ఇబ్బడి ముబ్బడిగా పోగేసుకుంటున్న డబ్బుల కట్టల లెక్కలన్నీ సీబీఐ, ఈడీ కూపీ లాగుతోంది. ఇండియాలో ఎవరో పనిగట్టుకుని ఆయనపై ఆరోపణలు చేయడం కాదు. జగన్ బ్యాచ్ చేస్తున్న ఫ్రాడ్, అవినీతిని విదేశీ సంస్థలు బయటపెడుతున్నాయని జాతీయ  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని విదేశీ సంస్థలు అంటున్నాయి. జగన్‌కు దగ్గరగా ఉండే వ్యక్తులు, ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నవాళ్లు విదేశాల్లో లెక్కపెట్టలేనన్ని డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సీఎం అనుచరులు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని విదేశాల నుంచి పిర్యాదులు, ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ వ్యవహారం సంగతి తేల్చేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం.

Updated Date - 2021-03-06T16:13:32+05:30 IST