వైసీపీ శ్రేణుల్లో టెన్షన్...

ABN , First Publish Date - 2021-08-25T17:23:59+05:30 IST

జగన్ బెయిల్ రద్దుకు సంబంధించిన కేసులో బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.

వైసీపీ శ్రేణుల్లో టెన్షన్...

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు సంబంధించిన కేసులో బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు  వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. జగన్మోహన్ రెడ్డి పదే పదే బెయిల్ ఖండిషన్లు ఉల్లంఘిస్తున్నారని, సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేశారనే ఆరోపణలపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే జగన్ తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం మరికొద్ది సేపట్లో తుది తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దయితే ఏపీ రాజకీయాల్లో కొంత ప్రభావం చూపే అవకాశముంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-08-25T17:23:59+05:30 IST