సానుభూతి కోసమే జగన్ యత్నం
ABN , First Publish Date - 2020-10-24T08:44:47+05:30 IST
న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతీసేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని గుంటూరు ఎంపీ, టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు
ఎంపీ గల్లా
గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతీసేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని గుంటూరు ఎంపీ, టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు గల్లా జయదేవ్ విమర్శించారు.
ప్రజా ప్రతినిధులపై విచారణ వేగవంతం చేయడంతో జగన్లో ఆందోళన నెలకొందన్నారు. జైలుకు వెళ్లినా ప్రజల సానుభూతి పొందేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.