జగన్ బీసీ నాయకులను అణచివేయాలని చూస్తున్నారు: ఎంఎస్ రాజు
ABN , First Publish Date - 2020-07-04T22:26:00+05:30 IST
జగన్ బీసీ నాయకులను అణచివేయాలని చూస్తున్నారు: ఎంఎస్ రాజు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఎంఎస్ రాజు విమర్శలు చేశారు. సీఎం జగన్ బీసీ నాయకులను అణచివేయాలని చూస్తున్నారని ఎంఎస్ రాజు మండిపడ్డారు. పరిపాలన చేతకాక కుల రాజకీయాలు చేస్తున్నారని ఎంఎస్రాజు విమర్శించారు. రాజధాని రైతులు 200 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని, వైసీపీ విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి చేతిలో బందీ అయిందని ఎంఎస్రాజు అన్నారు.