రైతాంగానికి జగన్ సమాధానం చెప్పాలి: దేవినేని
ABN , First Publish Date - 2021-10-13T20:15:12+05:30 IST
కేఆర్ఎంబీ తీర్మానాలకు ఎలా ఆమోదం తెలుపుతారు? అని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో
అమరావతి: కేఆర్ఎంబీ తీర్మానాలకు ఎలా ఆమోదం తెలుపుతారు? అని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర రైతాంగానికి గొంతు కోసే కార్యక్రమమని దుయ్యబట్టారు. మీకు మీకు లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉండొచ్చు... కానీ రాష్ట్ర రైతాంగం హక్కులను ఎలా తాకట్టు పెడతారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగకు ఏ విధంగా నీళ్లు వెళ్తాయని నిలదీశారు. ఉమ్మడి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ ప్రాజెక్టు జూరాలను ఎలా వదిలేశారని, ఏం లాలూచీ పడి జూరాల ప్రాజెక్టును వదిలేశారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో మీరు డబ్బులు తెచ్చుకున్నారని తాకట్టు పెట్టారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.