జగమంత కుటుంబం నాది..: వెంకయ్య
ABN , First Publish Date - 2021-07-27T07:24:24+05:30 IST
‘‘జగమంత కుటుంబం నాది’’ అనేదే భారతీయుల జీవన విధానమని ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ, జూలై 26: ‘‘జగమంత కుటుంబం నాది’’ అనేదే భారతీయుల జీవన విధానమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనా మహమ్మా రి నేపథ్యంలో.. ప్రజల మానసిక ఆరోగ్యంపై దృష్టి సా రించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధ్యాత్మిక చింతన అవసరతపై ప్రజలను ఆధ్యాత్మిక గురువులు చైతన్యం చేయాలన్నారు.
కాంబోడియా, వియత్నాంలలో ప్రాచీన హిందూ దేవాలయాలపై ప్రచురితమైన రెండు తెలుగు పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా వెంకయ్య ఈ సందేశమిచ్చారు. కంచి కామకోటి పీఠాధిపతి దివంగత స్వామి జయేంద్ర సరస్వతి జయంతి సందర్భంగా స్వామీజీకి వెంకయ్య నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి తదితరులు పాల్గొన్నారు.