మీడియా ప్రచారం కోసమే ఆ నాయకుల డ్రామాలు: జగదీష్రెడ్డి
ABN , First Publish Date - 2022-05-02T23:39:26+05:30 IST
మీడియా ప్రచారం కోసమే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు.
సూర్యాపేట: మీడియా ప్రచారం కోసమే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కొంగ జపాలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. నాయకత్వం, అంతర్గత విభేదాలను పరిష్కరించడం కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. ప్రజలు కాంగ్రెస్ నాయకులను చూసి భయపడుతున్నారని తెలిపారు. 2014,2018 సంవత్సరంలోనే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 66 ఏళ్ల కాంగ్రెస్ పాలన అనుభవాలను ఏడేళ్ల టీఆర్ఎస్ పాలన అనుభవాలను ప్రజలు గుర్తిస్తూ గమనిస్తున్నారని చెప్పారు. మొదటగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరో తెలుసుకున్నాకే విమర్శలు చేయాలని జగదీష్రెడ్డి వ్యాఖ్యానించారు.