కేసీఆర్ దార్శనికతకు రైతు వేదికలు నిదర్శనం: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-07-10T19:58:03+05:30 IST

నల్లగొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కేసీఆర్ దార్శనికతకు రైతు వేదికలు నిదర్శనం: జగదీష్‌రెడ్డి

నల్లగొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు వేదికల నిర్మాణాలు దేశానికే తల మానికలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. వ్యవసాయ విజ్ఞానం పెంపొందించేందుకు, గిట్టుబాటుధర నిర్ణయించేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నట్టు జగదీష్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ దార్శనికతకు రైతు వేదికలు నిదర్శనమన్నారు. భూసారం, పోషకాల చర్చకు రైతు వేదికలు దోహద పడతాయన్నారు. వ్యవసాయానికి నీళ్లు, పెట్టుబడినిచ్చిన కేసీఆర్ నాయకత్వంలోనే వ్యవసాయం పండుగాలా మారిందన్నారు. ఇదే స్ఫూర్తి యావత్ భారత దేశంలోనూ రావాలని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-07-10T19:58:03+05:30 IST