‘రైతుబంధు’ దేశానికే ఆదర్శం : జగదీశ్వర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-07-03T11:20:23+05:30 IST

కేసీఆర్‌ రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబందు పథకం దేశానికే ఆదర్శమని జిల్లా రైతు సమితి అధ్యక్షుడు

‘రైతుబంధు’ దేశానికే ఆదర్శం : జగదీశ్వర్‌రెడ్డి

 పెద్దమందడి/ గోపాల్‌పేట/ వనపర్తి అర్బన్‌, జూలై 2: కేసీఆర్‌ రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబందు పథకం దేశానికే ఆదర్శమని జిల్లా రైతు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఖరీఫ్‌ పంటల కోసం రైతుబంధు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయడంతో మండల కేంద్రంలో రైతులు కేసీఆర్‌ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ మేఘారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రఘు పతిరెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, వెంకటస్వామి, సత్యారెడ్డి పాల్గొన్నారు.


గోపాల్‌పేట మండల కేంద్రంలో గరువారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నాయకులు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ సభ్యురాలు భార్గవి పాల్గొన్నారు.  పట్టణంలోని రాజీవ్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ లక్ష్మయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకట్రావ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటీశ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-03T11:20:23+05:30 IST