సంప్రదాయాలను కొనసాగించాలి: జగదీష్ రెడ్డి
ABN , First Publish Date - 2020-10-24T20:32:21+05:30 IST
సంప్రదాయాలను కొనసాగించాలి: జగదీష్ రెడ్డి
సూర్యాపేట : కోవిడ్ నేపథ్యంలో సామూహిక ఉత్సవాలైన బతుకమ్మ, దసరా పండుగలను ఎవరికి వారు తమ ఇళ్లల్లో జరుపుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సాంస్కృతిక వారసత్వం మన బతుకమ్మ పండుగన్నారు. ప్రవాస భారతీయులు తెలంగాణ సాంస్కృతని, సంప్రదాయాలను కొనసాగించాలన్నారు. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెల్ బోర్న్ నగరంలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలలో ఆన్లైన్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.