పెన్షన్ల చెల్లింపుపై పునఃపరిశీలించండి

ABN , First Publish Date - 2020-04-03T11:08:00+05:30 IST

ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ ప్రభావం చూప డంతో విశ్రాంత ఉద్యోగుల జీవనభృతిలో 50 శాతం చెల్లింపులను వాయిదా వే యాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని విశ్రాం త ఉద్యోగుల జిల్లా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) విజ్ఞప్తి చేసింది.

పెన్షన్ల చెల్లింపుపై పునఃపరిశీలించండి

గుజరాతీపేట, ఏప్రిల్‌ 2 : ఆర్థిక వ్యవస్థపై  లాక్‌డౌన్‌ ప్రభావం చూప డంతో విశ్రాంత ఉద్యోగుల జీవనభృతిలో 50 శాతం చెల్లింపులను వాయిదా వే యాలని తీసుకున్న  నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని విశ్రాం త ఉద్యోగుల జిల్లా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.26 పై గురు వారం జేఏసీ నాయకులు టెలీ కాన్ఫెరెన్స్‌ సమీక్షించారు.


పెన్షన్‌లో 50 శాతం కోత వల్ల విశ్రాంత ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాద ఉందని వారన్నారు. ప్రతీ ఒక్కరూ పెన్షన్‌ కోసం ఎదురు చూసేవారేనని అభి ప్రాయపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పునఃపరిశీలించి విశ్రాంత ఉద్యో గులను ఆదుకోవాలని కోరారు.  సమీక్ష సమావేశంలో  జేఏసీ జిల్లా అధ్యక్షుడు టి.వీరభద్రస్వామి, పోలీసు సంఘం నుంచి రామారావు, పండా, మెడికల్‌ విభాగం నుంచి సోమసుందర్‌, ఉపాధ్యాయ విభాగం నుంచి పార్వతీశం, సో షల్‌ వెల్ఫేర్‌ విభాగం నుంచి ప్రకాశరావు, ఆడిటర్‌ ఎన్‌వీ రమణ, రెవెన్యూ విభాగం నుంచి ఆర్‌.మోహనరావు, డీపీ దేవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-03T11:08:00+05:30 IST