పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వంతో జేఏసీ నేతల చర్చలు
ABN , First Publish Date - 2022-03-08T16:56:42+05:30 IST
మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించింది.
అమరావతి: మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించింది. పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తోన్న జేఏసీ నేతలను చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది.మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డితో చర్చలు జరిపేందుకు అమరావతికి జేఏసీ ఛైర్మన్ నారాయణ రెడ్డి వచ్చారు. ఆయనతో సహా వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ చర్చలకు వచ్చారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో కలిసి పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు కోసం కొంత కాలంగా జేఏసీ నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే.