డెల్టా పేపర్ మిల్ మూసివేతను ఆపండి
ABN , First Publish Date - 2021-10-24T05:27:00+05:30 IST
డెల్టా పేపర్ మిల్లు మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెయ్యి మంది కార్మిక కుటుంబాల ఉపాధిని పరిరక్షించాలని జేఏసీ నాయకులు ఎం.సూర్యనారాయణరాజు, వైఎస్ఎన్ రాజు కోరారు.
ఎమ్మెల్యే రామరాజుకు జేఏసీ నాయకుల వినతి
పాలకోడేరు, అక్టోబరు 23 : డెల్టా పేపర్ మిల్లు మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెయ్యి మంది కార్మిక కుటుంబాల ఉపాధిని పరిరక్షించాలని జేఏసీ నాయకులు ఎం.సూర్యనారాయణరాజు, వైఎస్ఎన్ రాజు కోరారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజును కలిసి పేపర్ మిల్లు మూసివేయకుండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.మిల్లు మూసివేసిన కాలానికి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు.వేండ్రలోని డెల్టా పేపర్మిల్ మూసివేత నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కారణంగా వచ్చిన తాత్కాలిక ఇబ్బందులను అధిగమించడం పెద్ద సమస్య కాదన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో భద్రం, టి.శ్రీను, ఆర్వీ .రమణ, కేఎస్ఎన్ వర్మ, జీవీ.సత్యనారాయణ, రవి, మీరయ్య, పుల్లయ్య, దానయ్య, నారాయణరాజు ఉన్నారు.