ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల ర్యాలీ

ABN , First Publish Date - 2022-07-01T05:55:52+05:30 IST

ఆజాది కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి అన్నారు.

ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల ర్యాలీ
ఆచంటలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ఆచంట, జూన్‌ 30: ఆజాది కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి అన్నారు. యువత అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఆచంటప్రభు త్వ ఐటీఐ కళాశాల ఆధ్వర్యంలో గురువారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవ వేడుకలు కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందుకూరి వెంకట సత్యనారాయణ రాజు నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, పలువురు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కోట వెంకటేశ్వరరావు, ఉల్లం రామానుజం, బాలం రామకృష్ణ, ఐటీఐ కళాశాల  సిబ్బంది,  విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:55:52+05:30 IST