భయంతో.. మృతదేహాలను పాతిపెట్టేశారు..

ABN , First Publish Date - 2021-09-17T01:05:19+05:30 IST

కుమురంభీం జిల్లా: అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చనిపోయారు. అయితే వణ్యప్రాణుల వేటగాళ్లు.. భయంతో ఆ మృతదేహాలను పాతిపెట్టారు. ఈ ఘటన కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం విలేజ్ నెం ఆరు

భయంతో.. మృతదేహాలను పాతిపెట్టేశారు..

కుమురంభీం జిల్లా: అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చనిపోయారు. అయితే వణ్యప్రాణుల వేటగాళ్లు.. భయంతో ఆ మృతదేహాలను పాతిపెట్టారు. ఈ ఘటన కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం విలేజ్ నెం ఆరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామ సమీపంలో పొలం వద్ద వేటగాళ్లు.. వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. ఇద్దరు యువకులు వేట కోసం అటుగా వెళ్తూ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.


బయటికి తెలిస్తే ఏమవుతుందోననే భయంతో ఆ మృతదేహాలను వేటగాళ్లు పాతిపెట్టారు. మృతులు గన్నారం గ్రామానికి చెందిన సత్తయ్య, దుర్గారాజ్‌గా గుర్తించారు. బుధవారం రాత్రి వన్యప్రాణుల వేటకు వెళ్లిన యువకులు.. వేరే వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగల కారణంగా మృతి చెందారు. ఈస్గాం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-17T01:05:19+05:30 IST