‘గిరిజనుల ఆరోగ్య భద్రతకు సమన్వయంతో పనిచేయాలి’

ABN , First Publish Date - 2020-10-02T08:53:56+05:30 IST

గిరిజనుల ఆరోగ్య భద్రతకు పూర్తి భరోసా కల్పించే విధంగా వైద్య, ఆరోగ్య, మహిళా-శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రవీణ్‌ ఆదిత్య కోరారు.

‘గిరిజనుల ఆరోగ్య  భద్రతకు సమన్వయంతో పనిచేయాలి’

రంపచోడవరం, అక్టోబరు 1: గిరిజనుల ఆరోగ్య భద్రతకు పూర్తి భరోసా కల్పించే విధంగా వైద్య, ఆరోగ్య, మహిళా-శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రవీణ్‌ ఆదిత్య కోరారు. గురువారం ఆయన రెండు శాఖల అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. మలేరియా నియంత్రణ చర్యలు, ఇమ్యూనైజేషన్‌, గర్భిణుల నమోదు, మాతా-శిశు సంరక్షణ చర్యలు, పీహెచ్‌సీల్లో నాడు-నేడు పనుల నిర్వహణ, వైఎస్సీర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ అమలు, వైద్య సేవల ప్రగతిపై సమీక్షించారు.


హైరిస్క్‌ గర్భిణుల పట్ల దత్తత సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రంపచోడవరానికి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైందన్నారు. డీఎంవో పీవీ సత్యనారాయణ, వైద్యాధికారి పాపారావు, సబ్‌ యూనిట్‌ అధికారి రామకృష్ణ, ఎంపీహెచ్‌వో గోవిందబాబు, సీడీపీవోలు నీలవేణి, మాధవి, వరహాలు, రత్న      కుమారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-02T08:53:56+05:30 IST