మంచు పర్వతంపై ఎముకలు కొరికే చలిలో ఐటీబీపీ జవాన్ల గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-26T15:52:09+05:30 IST

జమ్మూకశ్మీరులోని లడఖ్ ప్రాంతంలో 17,500 అడుగుల ఎత్తులోని మంచుపర్వతాలపై ఎముకలు కొరికే చలిలో ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు సిబ్బంది బుధవారం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు...

మంచు పర్వతంపై ఎముకలు కొరికే చలిలో ఐటీబీపీ జవాన్ల గణతంత్ర వేడుకలు

లడఖ్ : జమ్మూకశ్మీరులోని లడఖ్ ప్రాంతంలో 17,500 అడుగుల ఎత్తులోని మంచుపర్వతాలపై ఎముకలు కొరికే చలిలో ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు సిబ్బంది బుధవారం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు.మంచు పర్వతాలపై మైనస్ 40 డిగ్రీల సెల్షియస్ ల ఉష్ణోగ్రత మధ్య ఐటీబీపీ జవాన్లు గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. దేశ సరిహద్దుల్లోని ఔలీలో ఒకవైపు మంచు కురుస్తున్నామంచులోనే ఐటీబీపీ హిమవీర్ జవాన్లు త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకొని స్కేటింగ్ చేశారు. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడులో భారతీయ వైమానిక దళం మిగ్ 21, గ్నాట్, లైట్ కంబాట్ హెలికపా్టర్, అసిలెడ రాడార్, రాఫేల్ ఎయిర్ క్రాఫ్టులను విన్యాసాలను ప్రదర్శించామని వింగ్ కమాండర్ వికాస్ శ్రోథ్య చెప్పారు. 

Updated Date - 2022-01-26T15:52:09+05:30 IST